జాతీయనది
గంగానది లేక గేంజస్ భారతదేశంలోని అతి పొడవైన నది. పర్వతాలు, లోయలు, మైదానాలు వెంబడి 2,510 కి.మీ లు దూరం ప్రవహిస్తుంది. ఇది హిమాలయాల్లోని గంగోత్రి హిమనది ప్రాంతంలోని మంచు భూభాగంలో భాగీరధి నదిగా జన్మిస్తుంది. తరువాత ఈ నదిలో అలకనంద, యమున, సోన్, గుమ్టి, కోసి మరియు ఘాగ్రా అనే నదులు కలుస్తాయి. గంగానదీ పరివాహక ప్రాంతం, ప్రపంచంలోనే అతి సారవంతమైన మరియు జనాభా సాంద్రత కలిగిన 1,000000 చ.కి.మీ.ల ప్రాంతం ఈ నది మీద రెండు ఆనకట్టలు (డ్యాములు) ఉన్నాయి. ఒకటి హరిద్వార్ లోనూ, మరోకటి ఫరక్కాలోనూ ఉన్నాయి. గంగానది డాల్పిన్ ఈ నది ప్రాంతంలోనే జీవించే జంతువు, యిప్పడు కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. ఈ భూమి మీద ప్రవహించే నదుల్లో గంగానదిని అతి పవిత్రమైన నదిగా హిందువులు గౌరవిస్తారు. ముఖ్యమైన మత ధార్మిక సంబంధమైన కార్యక్రమాలు, ఈ నది ఒడ్డునగల పట్టణాలు, వారణాసి, హరిద్వార్ మరియు అలహాబాద్ లలో నిర్వహిస్తారు. గంగానది, గంగా డెల్టా ప్రాంతమైన బంగ్లాదేశ్ లోని సుందర్ బాన్స్ బురద నేలల్లో పూర్తిగా విస్తరించి, చివరకు తన ప్రయాణాన్ని ముగించి బంగాళాఖాతం సముద్రంలో కలిసిపోతుంది.


