జాతీయ ఫలం
ప్రపంచంలోని, ఉష్ణమండదేశాల్లో, విస్తారంగా పండించబడే అతి ముఖ్యమైన ఫల పంట మామిడి (మాంగిఫరా యిండిలే) యొక్క పండు పుష్టి కలిగిన పండు ఇది, నేరుగా పండులా తినవచ్చు లేదా ఊరగాయలు మొదలైన వాటికి పచ్చడి మామిడి కాయలను ఉపయోగించవచ్చు. దీనిలో రసం కలిగిన పండు విటమిన్లు ఎ, సి, డి లను పుష్కలంగా కలిగి ఉంది. భారతదేశంలో వంద రకాలకు పైగా మామిడి వివిధ పరిమాణాల్లో రూపాల్లో లభ్యమౌతుంది. చిరకాలం నుండి మామిడి భారతదేశంలో సాగు చేయబడుతుంది. కవి కాళిదాసు, తన కవిత్వంలో ఈ పండు యొక్క ప్రాశస్యాన్ని కీర్తించాడు. అలెగ్జాండరు, చైనీయుల యాత్రికుడైన హ్యూయాన్ ల్సాంగ్ కూడా దీని రుచిని ఆస్వాదించారు. మొఘల్ చక్రవర్తి అక్బర్, 100000 మామిడి చెట్లను బీహార్ లోని దర్భాంగా లో నాటించాడు. ఇప్పుడు ఆ తోట, లఖీబాగ్ అని పిలవబడుతుంది.


