జాతీయ పుష్పం
కమలం (నిలుంబా న్యూసిపెరా గెయార్టిన్) భారతదేశం యొక్క జాతీయ పుష్పం ఇది పవిత్రమైనది మరియు, ప్రాచీన భారతదేశంలో కళ, పురాణాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉండి, ఒక శుభ సంకేతంగా భారత సంస్కృతిలో కాలాతీతంగా నిలిచి ఉంది.
భారతదేశం, వన సంపదలో సుసంపన్నమైనది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో పదో స్థానంలోనూ, ఆసియాలో నాలుగో స్థానంలోనూ ఉంది. భౌగోళిక ప్రాంతంలో యిప్పటి వరకూ, సర్వే జరిపిన 70 శాతం ప్రాంతంలో 47,000 రకాల మొక్కలు ఉన్నట్లు బొటానికల్ సర్వే ఆఫ్ యిండియా (భారతదేశ వృక్ష అధ్యయన కేంద్రం - BSI )ప్రకటించింది.


