జాతీయ క్రీడ
హాకీ క్రీడలో మాత్రం భారతదేశం క్రీడా మైదానాన్ని ఏలింది. మన దేశానికి, ఎనిమిది ఒలపింక్ బంగారు పతకాలు గెలిచిన అద్భుతమైన చరిత్ర ఉంది. భారతదేశపు హాకీ స్వర్ణ యుగం 1928- 56 లలో భారతదేశపు హాకీ జట్టు వరుసగా ఆరు ఒలపింక్ బంగారు పతకాలను సాధించినపుడు వచ్చిందని చెప్పవచ్చు. జట్టు 1975 ప్రపంచ కప్పు తో పాటు మరి రెండు పతకాలు కూడా గెలిచింది. భారతదేశపు హాకీ హాకీ క్రీడా సమాఖ్య, ప్రపంచ గుర్తింపు 1927లో పొంది అంతర్జాతీయ హాకీ సమాఖ్యలో చేరింది. ఈ విధంగా భారతదేశపు హాకీ సమాఖ్య చరిత్ర ప్రారంభమై భారతదేశం ఒలంపిక్స్ లో అడుగుపెట్టి, బంగారు శకం మొదలు పెట్టింది. ఆ క్రీడాయాత్ర బ్రహ్మాండమైన విజయం సాధించింది. భారతదేశం 21 మ్యాచ్ లలో 18 గెలుపొందింది. అంతేకాక ప్రసిద్ధి చెందిన ధ్యాన్ చంద్, అందరి దృష్టి ఆకర్షించేటట్లు భారతదేశం సాధించిన 192 గోల్స్ లో 100 గోల్స్ కు పైగా అతడే చేశాడు ఈ ఆట జయించడం అమ్ స్టర్ డామ్ లో 1928లో ప్రారంభమై, భారతదేశం గెలిచే క్రమంలో 1932 లో లాస్ ఏంజల్స్ లోనూ, 1936లో బెర్లిన్ లోనూ హ్యాట్రిక్ (వరుసగా మూడు) ఒలపింక్ బంగారు పతకాలు సాధించింది. భారతదేశ స్వాతంత్ర సముపార్జన తరువాత – భారత జట్టు, మళ్ళీ యింకో మారు వరుసగా మూడు (హ్యాట్రిక్) బంగారు పతకాలను, 1948 లండన్ ఒలంపిక్స్, 1952 హెల్సెంకీ గేమ్స్ లోనూ, మరియు మెల్ బోర్న్ ఒలంపిక్స్ లోనూ సాధించింది. ఈ బంగారు శకంలో, భారతదేశం 24 ఒలపింక్ ఆటలు లో ఇరవై నాలుగు గెలిచి 178 గోల్స్ కు మించి సాధించి (7.43 గోల్స్ ఆట సగటుగా) కేవలం 7 గోల్స్ మాత్రమే వదిలివేసింది. మిగిలిన రెండు బంగారు పతకాలు భారతదేశానికి, 1964 టోక్యో ఒలంపిక్స్ లోనూ మరియు 1980 మాస్కో ఒలంపిక్స్ లోనూ వచ్చాయి.


