|
కేంద్రీయ విద్యాలయాలలో ప్రవేశం గురించి 2007-2008 సంవత్సరం నుండి
అమలులో ఉండే విధంగా ఈ దిగువ మార్గదర్శక సూత్రాలను జారీ చేయడం
జరిగింది.
ప్రవేశ విధానం:
కేంద్రీయ పాఠశాలలలో ప్రవేశానికై పిల్లలు తమ పేర్లను నమోదు చెసుకోవటానికి
దరఖాస్తులను ఆహ్వానిస్తూ, ప్రాంతీయ కార్యాలయం వారు ఫిబ్రవరి మొదటి వారంలో,
మండల స్థాయిలలోని స్థానిక వార్తా పత్రికలలో ప్రచురింపబడే విధంగా ప్రకటన
ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రకటనలో ప్రవేశానికై నమోదు చేసుకోవటానికి కావలసిన
అన్ని వివరాలు ఉంటాయి. ఈ విధంగా విడుదల చేసిన ప్రకటన-
కేంద్రీయ విద్యాలయాలలోకి ప్రవేశం కేంద్ర ప్ర్రభుత్వ ఉద్యోగుల
పిల్లలకు మాత్రమే కాదనీ, మరియు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునని,
కేవలం కొన్ని వర్గాలకు చెందిన పిల్లలకు ప్రవేశంలో కొంత ప్రాధాన్యత మాత్రం
ఇవ్వబడుతుందని స్పష్టంగా తెలియ జేయాలి. షెద్యూల్డ్ కులాల, జాతుల వారికి
మరియు వికలాంగులకు ఏ మేరకు ప్రవేశంలో కేటాయింపులు ఉన్నాయో ఈ ప్రకటనలో
తప్పనిసరిగా సూచించాలి.
ధరఖాస్తు ఫారమునకు, ఎంపిక పధ్ధతి, ఇంకా ఇతర వివరములకు ఈ
క్రింది వెబ్ సైట్ ను చూడండి.
http://kvsangathan.nic.in/guidelines1.aspx |