సురక్షిత మైన మాతృత్వం.
|
|
సురక్షితమైన మాతృత్వం గురించి అందరూ తెలుసుకొని పాటించటం చాలా ముఖ్యం. ఎందుకంటే గర్భధారణ, ప్రసవం కారణంగా తలెత్తిన సమస్యలతో రోజుకు కనీసం 1400 మంది మహిళలు మరణిస్తున్నారు. ఇంకా వేలాది మంది స్త్రీలు గర్భిణులుగా వున్నప్పుడు తలెత్తే సంక్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు ఎక్కువగా ప్రాణాలకు ముప్పు తెచ్చేవి గానీ, తీవ్రమైన వైకల్యం కలిగించేవి గానీ అయి ఉంటున్నాయి. గర్భధారణకు ముందే మహిళ చక్కని పోషకాహారం అలవాట్లు కలిగి, ఆరోగ్యంగా ఉన్నట్లయితే కడుపున శిశువును మోయటం వల్ల తలెత్తే ఆరోగ్య ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చు. అయితే, ఆ మహిళ గర్భిణిగా ఉన్న ప్రతిసారి కనీసం 4 సార్లు శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త చేత పరీక్ష చేయించుకోవాలి. కాన్పులు చేయటం లో నైపుణ్యం గల వైద్యులు , నర్సులు సమీక్షంలోనే ప్రసవం జరగాలి. కాన్పు అయిన 12 గంటల లోపు ఆ మహిళ ను పరీక్షించాలి. శిశు జననం తర్వాత ఆరు నెలలకు మరోసారి ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించాలి. మహిళలకు కాన్పు ముందు, ఆ తర్వాత అవసరమయ్యే ఆరోగ్య సేవా సదుపాయాలను అందుబాటులో ఉంచటం ప్రభుత్వానిదే బాధ్యత. ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి మహిళలకు ప్రసవం సమయంలో వారు సహాయపడేలా చూడొచ్చు.గర్భస్థ దశ, కాన్పు సమయాల్లో తీవ్రమైన సమస్య తలెత్తే అవకాశంగల మహిళలకు ప్రత్యేకమైన సంరక్షణతో పాటు పెద్దాస్పత్రిలో వైద్యం లభించేలా ఆరోగ్య కార్యకర్తలు చూడాలి. మహిళలపై అన్ని రకాల వివక్షలను రూపు మాపే అంశంపై జరిగిన సదస్సులో అత్యధిక దేశాల ప్రబుత్వాలు ఒక అంతర్జాతీయ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. ఆ ఒప్పందంలో భాగంగా, గర్భిణీ మహిళలకు అవసరమైన అన్ని రకాల ఆరోగ్య సేవలను కల్పించటానికి ప్రభుత్వాలు చట్టబద్దంగా కట్టుబడి ఉండాలని ప్రకటించాయి.
|
||
| << వెనుకకు ముందుకు >> |


