మొబైల్ ఫోను : ఒక బాధ్యతాయుతమైన బట్వాడా మార్గంగా ఏర్పడుతున్న క్రమం

ఈ రోజు మొబైల్ ఫోను, కేవలం వాక్యాలు ను మరియు మాటల ద్వారా సమాచార సంబంధం కల్పించే ఉపకరణంగా లేదు. ఇది పట్టణ ధనికులు మరియు పల్లె పేదల మధ్య ఉన్న అంకెల అంతరాన్ని తొలగించడంలో ఒక దృఢమైన సాంకేతిక విజ్ఞానంగా అవతరించింది. భారతదేశంలో, మొబైల్ ఫోను ప్రవేశించిన రెండు దశాబ్దాలలో, మారుమూల గ్రామీణ పల్లెలకు, అనుసంధాన లోపం, విద్యుత్ కొరత మరియు తక్కువ స్ధాయి అక్షరాస్యత వంటి అందరికీ తెలిసిన అడ్డంకులు ఉన్నప్పటికీ, చేరుతుంది. ఇంకొక వైపు, యువకులకు, ప్రత్యక్షంగానూ, మరియు పరోక్షంగాను లక్షలాది ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది.

తన అభివృద్ధి పధంలోని రెండవ దశలో, వివిధ రకాల సేవలకు ఇది ఒక బట్వాడా మాద్యమంగా అవతరించింది. ఎవరైనా తమ మొబైల్ ఫోను ను ఉపయోగించి, తమ బ్యాంకు ఖాతాలోని సోమ్మును వేరొక బ్యాంకు ఖాతా లోనికి బదిలీ చేయవచ్చు. ప్రభుత్వ సంస్ధలు మరియు ప్రైవేట్ సంస్ధలు కూడ తమ పౌర సేవలు మరియు వ్యాపార సేవలను సామాన్య మానవునికి మొబైల్ ఫోను ద్వారా అందజేయడం మొదలు పెట్టాయి. ఈ మధ్యనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ యిండియా, వాణిజ్య బ్యాంకుల సేవలను మొబైల్ ఫోను ద్వారా అందజేయడానికి ఒప్పుకుంది. అదే విధంగా భారత ప్రభుత్వం, మంత్రిత్వ శాఖల సమన్వయంతో అభివృద్ధి చేసిన మొబైల్ ఫోను ద్వారా ఆర్ధిక సేవల బట్వాడా పై పధక రచన ను అంగీకరించింది. 3 జి సాంకేతిక పరిజ్ఞానం, భారతదేశంలో ప్రారంభమైన తరువాత (2010 సంవత్సరాయంలో సామాన్యంగా వినియోగించుకోవడానికి, ఇది అందుబాటులో ఉంటాయి.) వినియోగదారులు, ఆరోగ్య, విద్య, వ్యవసాయం, సమాచార సేవలను తమ మొబైల్ ఫోను ద్వారానే అందుకోగలుగుతారు.

భారతదేశంలో మొబైల్ – పరిపాలన
 
క్రొత్తదనం ఏమిటి ?
 
 
పేద ప్రజలు మొబైల్ ఆర్ధిక సేవలను ఉపయోగించుకోవడం



Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: